రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేత పై ఎంపీ డీకే అరుణ ఫైర్

జడ్చర్ల పెద్ద గుట్ట పై ఉన్న రంగనాయక స్వామి దేవాలయం కోనేరును ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా పూడ్చి వేస్తారని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు.

Update: 2024-07-07 11:45 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : జడ్చర్ల పెద్ద గుట్ట పై ఉన్న రంగనాయక స్వామి దేవాలయం కోనేరును ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా పూడ్చి వేస్తారని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఈ సంఘటన పై ఆదివారం ఆమె 'దిశ' తో ఫోన్ లో మాట్లాడుతూ జడ్చర్ల సీఐ ఆదిరెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశానని, నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేత పై సమగ్ర విచారణ జరిపించి, ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎంతటివారినైనా వదలోద్దని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను శిక్షించాలని, హిందువుల మనోభావాలను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.


Similar News