సభ్యత్వ నమోదు కార్యక్రమంలో డీకే అరుణ

గ్రామాల్లో బీజెపీ సభ్యత్వాలు పెరిగితేనే బీజెపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు.

Update: 2024-10-05 13:57 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: గ్రామాల్లో బీజెపీ సభ్యత్వాలు పెరిగితేనే బీజెపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో బీజెపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ప్రతి కియాశీల సభ్యులు 100 మందీని పార్టీ లో చేర్పించాలనీ తెలిపారు. భావి భారతం బాగుండాలంటే బీజేపీ మరింత బలపడాలాన్నారు. సభ్యత్వాలు పెంచినోళ్ళకే లోకల్ బాడీస్ ఎన్నికలల్లో అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలంటే బీజేపీ పటిష్టం కావాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి..పార్టీ సభ్యత్వాలు పెంచినోళ్లకు మంచి రివార్డులు ఇస్తామన్నారు. ఎక్కువ సభ్యత్వాలు చేయించినోళ్ళకే పార్టీలో పదవులు ఉంటాయన్నారు. 


Similar News