టైర్ పేలి బోల్తాపడిన కారు

టైర్ పేలి కారు బోల్తాపడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో చోటు చేసుకుంది.

Update: 2024-10-05 13:15 GMT

దిశ, కొల్లాపూర్ : టైర్ పేలి కారు బోల్తాపడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా..కారులో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కొల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు కొన్ని పైల్స్ తీసుకొని.. డ్రైవర్ బిజ్జా దశరథం అలియాస్ టోపీ దశరథం (50)తో పాటు,రెవిన్యూ కార్యాలయంలో పనిచేసే చుక్కాయపల్లికి చెందిన జెట్టి మహేష్(27) కలెక్టరేట్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అంకిరావుపల్లి బస్ స్టేజీ సమీపంలో కార్ టైర్ పేలి పల్టీలు కొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణించాడు. మృతుడికి భార్య లక్ష్మి ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News