భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలి

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో ఆయకట్టుకు నీరు అందించే విధంగా.. నిలిచిపోయిన భూసేకరణ పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-22 15:04 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో ఆయకట్టుకు నీరు అందించే విధంగా.. నిలిచిపోయిన భూసేకరణ పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో భూసేకరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ప్యాకేజీ 99, 100 పరిధిలో మిగిలిపోయిన 488 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ పనులను వెంటనే పునరుద్ధరించి ఆయకట్టుకు నీరందించే విధంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. చేపట్టిన పనుల పురోగతిపై నెల రోజుల తర్వాత తిరిగి సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, గద్వాల తహశీల్దార్ మల్లికార్జున్, ధరూర్ తహశీల్దార్ వెంకట్రావు, ఇరిగేషన్ శాఖ డీఈ లు, ఏఈ లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News