దిశ విలేకరిపై హెచ్​ఎం చిందులు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభం రోజే ఆలస్యంగా వచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Update: 2024-10-15 15:18 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండి చింతపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభం రోజే ఆలస్యంగా వచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఆ విషయంపై దిశలో మంగళవారం నా స్కూల్.. నా ఇష్టం అనే కథనం ప్రచురితమైంది. దాంతో ఉపాధ్యాయుడు దిశ విలేకరిపై ఎదురు దాడి చేశారు.

    నీవు ఎలా వార్త రాస్తావు, నీవు చూశావా,  నీపై పరువు నష్టం దావా వేస్తా,  కేసు నమోదు చేస్తా అని బెదిరించాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విషయం మాత్రమే వార్త రాశానని, మీ వ్యక్తిగత విషయాలు రాయలేదని దిశ విలేఖరి సమాధానం చెప్పినా వినలేదు. కాగా ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని వీడకుండా వ్యవహరించాలని, వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  

Tags:    

Similar News