మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయండి

నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో.. మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా మారిందని సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-10-20 12:37 GMT

దిశ, ఊట్కూర్ : నిధులు పూర్తిగా విడుదల చేయకపోవడంతో.. మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగా మారిందని సామాజిక కార్యకర్త మహేష్ గౌడ్ ఒక ప్రకటనలో అసహనం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బిజ్వార్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి లో భాగంగా.. 2022 ఏప్రిల్ నెలలో ప్రారంభమైన మరుగుదొడ్లు పనులు నేటికీ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత కలెక్టర్ కోయ శ్రీహర్ష పనులను పర్యవేక్షించి వేగవంతం చేయాలని ఆదేశించిన..గుత్తే దారులు 80% మేర పనులు పూర్తి చేశారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాల మరుగుదొడ్లు ను పరిశీలించి.. నిధులను విడుదల చేయాలాన్నారు. అసంపూర్తిగా మారిన పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.


Similar News