బీఆర్ఎస్కు భారీ షాక్.. మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జంప్ ?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకో కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
దిశ, గద్వాల ప్రతినిధి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షీతులై బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం నడుస్తుంది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేలు సాధించగా జోగులంబ గద్వాల జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ రెండు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంది. కాగా ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరగా ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో కాళీ కానుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ కృష్ణ మోహన్ రెడ్డి రేవంత్ సమక్షంలో పార్టీ మారగా మరో కొద్ది రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ చల్ల వేంకట్రామి రెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీ మారేందుకు అంత సిద్ధమైనట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.