Big News: డిండి వాగులో చిక్కుకున్న చెంచులు.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది.

Update: 2024-09-03 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 11 మంది  చెంచులు తేనె వేట కోసం బోయినపల్లి డిండి వాగు వైపు వెళ్లి చిక్కుకుపోయారు. వారు రాత్రంతా వాగులోని ఓ గుట్ట ప్రాంతంలో తలదాచుకున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ఉదయాన్నే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ముందు డ్రోన్ కెమెరాలతో మొదటి వారి ఆచూకీ కనిపెట్టారు. అనంతరం తాడు సాయంతో వారికి వాగును క్షేమంగా దాటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.    


Similar News