ఉమామహేశ్వర స్వామి హుండీ లెక్కింపు..ఆరు నెలల ఆదాయం ఎంతంటే..?

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం

Update: 2024-10-26 13:09 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం శ్రీశైల ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం రంగాపురం ఆలయం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించారు. ఆరు నెలల 23 రోజులకు గాను హుండీ ఆదాయం రూ. 9 లక్షల 90 వేల 285  భక్తుల ద్వారా ఆదాయం లభించిందని ఆలయ ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరoమాధవ రెడ్డి ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మన్, పర్యవేక్షకులు నాగర్ కర్నూలు జిల్లా వెంకటేశ్వరమ్మ, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Similar News