CM Revanth Reddy : బాధిత కుటుంబానికి అండగా ఉంటా…

ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మండల మాజీ కాంగ్రెస్

Update: 2024-10-26 10:07 GMT

దిశ, మద్దూరు,కొత్తపల్లి: ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మండల మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాజ్ కుమారుడు కళ్లపు సతీష్ కుటుంబానికి అండగా ఉంటామని (CM Revanth Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.శనివారం మండల కేంద్రము లో జరిగిన సతీష్ కుమార్ దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుని తండ్రి శివరాజు,తల్లి భార్య పిల్లలను పరామర్శించారు.మృతిని పిల్లల చదువుల కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అంతకు ముందు హెలిప్యాడ్ దగ్గర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు.అనంతరం కొడంగల్ కి బయలుదేరారు.కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News