అయ్య బాబోయ్..లిక్కర్ బాటిల్స్ ధ్వంసం

సుమారు 30 లక్షల విలువ గల మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు లారీతో తొక్కించిన ఘటన జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Update: 2024-10-25 15:42 GMT

దిశ, జడ్చర్ల : సుమారు 30 లక్షల విలువ గల మద్యాన్ని( Alcohol )ఎక్సైజ్ శాఖ అధికారులు లారీతో తొక్కించిన ఘటన జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం కాటన్ లు (Alcohol )రోడ్డుపై చర్ల చేదుగా పడిపోయాయి. ఆ సమయంలో కొందరు మద్యం ప్రియులు కొన్ని బాటిల్లని ఎత్తుకెళ్లగా.. మిగతా వాటిని ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రెండు రోజుల పాటు కాపాడిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. శుక్రవారం మండల పరిధిలోని బూరెటిపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై మద్యం బాటిలను లారీ తో తొక్కించి.. సుమారు 30 లక్షల విలువ గల ఓసి మద్యాన్ని పారబోశారు. ప్రమాదంలో చర్లచెదులైన మద్యం బాటిల్లు అమ్మడానికి వీల్లేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..తాము ఈ పని చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.


Similar News