కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 22న అవగాహన సదస్సు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 22న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.

Update: 2024-10-16 14:02 GMT

దిశ, నాగర్ కర్నూల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 22న అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పై అవగాహన సదస్సుకు సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలని వారు అధికారులకు సూచించారు. బుధవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్జీవోస్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ లోని ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలపై నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సదస్సుకు ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వాలు అందించే పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించే విధంగా అధికారులు సమాయత్తం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ ప్రతినిధి వెంకట్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్లు చాగంటి సురేష్, మేనేజర్ అశ్విని కుమార్, ఎల్ డీఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News