హిందువులపై దాడులు సహించేది లేదుఃఎంపీ డీకే అరుణ

Update: 2024-08-13 08:50 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: హిందువులపై తాడులు చేస్తే సహించేది లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన హార్ ఘర్ తిరంగా ర్యాలీలో ఎంపీ డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రజల్లో జాతీయభావాన్ని పెంపొందించేందుకే తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను భావి తరాలకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

2047 కల్లా ఈ దేశాన్ని విశ్వ గురు వికసిత్ భారత్ సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదికి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో మోడీ ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తోందని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మనమంతా ఐక్యంగా ఉండి జాతీయ సమైక్యతను చాటాలన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దారుణమని ఖండించారు. ముందుగా సుభాష్ రోడ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎంపీ డీకే అరుణ పూలమాలలు వేసి నివాళులు అర్పించి జిల్లా కేంద్రంలో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.

Tags:    

Similar News