మరి కాసేపట్లో..పుట్టిన గడ్డకు సీఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో తన పుట్టిన గడ్డ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు.

Update: 2024-10-12 08:22 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో తన పుట్టిన గడ్డ నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. ప్రతి దసరా పండుగ రోజు తన సొంత ఊరులో జరిగే వేడుకలకు హాజరు కావడం ఆనవాయితిగా వస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా తన సొంత గ్రామానికి ముఖ్యమంత్రి వస్తుండడంతో.. అధికారులు భారీ ఎత్తున బందోబస్తు, ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం సొంత ఇంటి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రామానికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి జమ్మి పూజలో పాల్గొంటారు. రాత్రి వరకు సీఎం తన సొంత ఊరులోనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో గడపనున్నారు.


Similar News