సొంతూరులో ..సీఎం రేవంత్ రెడ్డి కు ఘన స్వాగతం

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వచ్చారు.

Update: 2024-10-12 10:16 GMT

దిశ, అచ్చంపేట/వంగూరు: సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి వచ్చారు. దీంతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. రెండు గంటల 45 నిమిషాల ప్రాంతంలో హైదరాబాదు నుంచి కొండారెడ్డిపల్లికి సీఎం హెలికాప్టర్లో వచ్చారు. ఈ సందర్భంగా సీఎంకు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, శ్రీహరి, తదితరులు పూల గుచ్చాలు అందజేసి సీఎంకు స్వాగతం పలికారు. అనతంరం ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యేలతో కలిసి సీఎం హెలిపాడ్ నుంచి గ్రామంలోకి బయలుదేరగా..గ్రామస్తులు గజమాలలు వేస్తూ పూల వర్షం కురిపించారు. బతుకమ్మలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.


Similar News