పండగపూట తీవ్ర విషాదం..యువకుడు మృతి

జడ్చర్ల లో విజయదశమికి తీవ్ర విషాదం జరిగింది.

Update: 2024-10-12 09:22 GMT

దిశ, జడ్చర్ల : జడ్చర్ల లో విజయదశమికి తీవ్ర విషాదం జరిగింది. టిప్పర్ ఢీ కొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. అవసరమైన కిరాణా సామాగ్రినీ తీసుకొని తన స్వగ్రామానికి వెళ్తూ.. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకోడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చింతకుంట తండాకు చెందిన టిప్పర్ ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. స్వామి అనే యువకుడు తి చెందాడు.దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను పోలీసులు తరలించారు.దీంతో బాధితుడి కుంటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ 44వజాతీయ రహదారిపై ఆందోళన చేశారు. ఈ క్రమంలో రెండు గంటల పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే పోలీసులు అధికారులు స్పందించి..న్యాయం చేయాలంట నిరసన చేశారు. దీంతో రూరల్ సీఐ నాగార్జున గౌడ్ స్థలానికి చేరుకొని.. కారణమైన టిప్పర్ డ్రైవర్ పై చట్టపరంగా చర్యలు చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు


Similar News