కాలువలో పడి వ్యక్తి గల్లంతు

బిజినేపల్లి మండలంలోని సల్కార్ పేట గ్రామానికి చెందిన మేఘ స్వామి (26) అనే యువకుడు కేఎల్ఐ కాలువలో చేపలు వేటకు వెళ్లి గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు.

Update: 2024-10-06 16:25 GMT

దిశ, బిజినేపల్లి: బిజినేపల్లి మండలంలోని సల్కార్ పేట గ్రామానికి చెందిన మేఘ స్వామి (26) అనే యువకుడు కేఎల్ఐ కాలువలో చేపలు వేటకు వెళ్లి గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. గల్లంతైన యువకుడి కోసం గ్రామస్తుల కే ఎల్ ఐ కాల్వలో గాలించిన ఫలితం లేకపోవడంతో..బిజినాపల్లి పోలీసులకు సమాచారం తెలిపారు. ఎస్సై వెంటనే ఎన్ డి ఆర్ ఎఫ్ రిస్క్ టీంకు సమాచారాన్ని అందించారు. సోమవారం ఉదయం ఎన్ డి ఆర్ ఎఫ్ రెస్కి టీం ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై నాగ శేఖర రెడ్డి తెలిపారు.


Similar News