ప్రాజెక్టుల పై సమగ్ర నివేదిక అందజేయాలి..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతి, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, తదితర అంశాలపై డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు.

Update: 2024-07-04 17:15 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతి, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపు, తదితర అంశాలపై డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ లపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, రామ్మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పర్ణిక రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘారెడ్డి, సాగునీటి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అనిల్ కుమార్, ఈఎన్సీ ( ఓ అండ్ ఎం) నాగేంద్ర రావు, సీఈలు విజయభాస్కర్ రెడ్డి, రఘునాథ రావు, బీవీ. రమణ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News