KTR : వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం సూర్యాపేట(Suryapeta)లో పర్యటించారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం సూర్యాపేట(Suryapeta)లో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల(BRS Silver Jubli Celebrations) ఏర్పాట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy)తో కలిసి సూర్యాపేటలో రోడ్ షో చేశానని, ఈ ర్యాలీలో పాల్గొన్న జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకు వచ్చినట్లుందన్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు ప్రారంభించానని, వచ్చే ఏడాది తాను పాదయాత్ర(Padayatra) చేస్తానని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని అడ్డగోలు హామీలు ఇచ్చిందని, కాని గెలుస్తామని వారు కూడా అనుకోలేదని ఎద్దేవా చేశారు. ఇపుడు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు మోసపోయారని, జనానికి కూడా నిజం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.