కొండా లక్ష్మణ్ బాపూజీ పదవులు ఆశించలేదు : బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

కొండా లక్ష్మణ్​ బాపూజీ ఎలాంటి పదవులను ఆశించకుండా తెలంగాణ కోసం ఉద్యమించారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు.

Update: 2024-09-21 14:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొండా లక్ష్మణ్​ బాపూజీ ఎలాంటి పదవులను ఆశించకుండా తెలంగాణ కోసం ఉద్యమించారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. అతడో నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడని శనివారం ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ సాధించడానికి, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తన జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని స్పష్టం చేశారు. గాంధేయవాదిగా విలువలకు కట్టుబడి, ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్ర ప్రస్తుత తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ పోరాటంలో వారితో పాటు క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం తనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రి వర్గంలో ఉండి ఉద్యమంలో చురుకుగా పాల్గొని, మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీదని నిరంజన్ అన్నారు.


Similar News