ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 6 వ్యవసాయి మార్కెట్ కమిటీలకు కొత్త సభ్యుల నియామకం

తెలంగాణలో పలు వ్యవసాయి మార్కెట్ కమిటీలకు కొత్త సభ్యుల నియామకమయ్యారు...

Update: 2024-09-21 17:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లతోపాటు నూతన పాలకవర్గాన్ని నియమించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు.

మిగిలిన మార్కెట్ కమిటీలకూ త్వరలోనే కొత్త పాలక వర్గాన్ని నియమిస్తామని వెల్లడించారు. నిజామాబాద్, కమర్‌పల్లి, వేల్పూరు, కరీంనగర్ జిల్లాలోని గోపాల్ రావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌పల్లి, కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్‌లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో రైతులకు మేలు జరిగేలా కమిటీలు పని చేయాలని మంత్రి తుమ్మల కొత్త సభ్యులకు సూచించారు.


Similar News