స్కూల్ బస్సులో మద్యం తరలింపు.. అధికారులు చేసిన పనికి అంతా షాక్

స్కూల్ బస్సులో మద్యం తరలిస్తుండగా.. పట్టుకుని కూడా వదిలేసిన ఎక్సైజ్ అధికారుల తీరు ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది

Update: 2024-07-08 05:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ బస్సులో మద్యం తరలిస్తుండగా.. పట్టుకుని కూడా వదిలేసిన ఎక్సైజ్ అధికారుల తీరు ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు స్టూడెంట్లను ఎక్కించుకొని పండితాపురం గ్రామంలో దింపడానికి వెళ్తోంది. ఈ క్రమంలో స్కూల్ బస్సులో లిక్కర్ సీసాలు తీసుకెళ్తున్నట్లు ఎక్సైజ్ ఆఫీసర్లకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న కారేపల్లి ఎక్సెజ్ సిబ్బంది వెంటస్కూల్ బస్సులో మద్యం తరలిస్తుండగా.. పట్టుకుని కూడా వదిలేసిన ఎక్సైజ్ అధికారుల తీరు ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుందినే బస్సు ఆపి తనిఖీ చేయగా.. ఐదు క్వార్టర్ సీసాలు దొరికాయి. అయినా సదరు వ్యక్తులను ఎక్సైజ్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకోకుండా, సీసాలను సైతం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆఫీసర్ల వైనం సోషల్ మీడియాలో జనాలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ప్రభుత్వ  అధికారులు లంచగొండిలా తయారవుతున్నారంటూ మండిపడుతున్నారు. 


Similar News