ధర్మపురి శ్రీనివాస్ మరణించడం ఎంతో దురదృష్టకరం

కాంగ్రెస్ పార్టీకి ఎంతో విశిష్ట సేవలందించిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణించడం ఎంతో దురదృష్టకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-06-29 11:36 GMT

దిశ,మణుగూరు : కాంగ్రెస్ పార్టీకి ఎంతో విశిష్ట సేవలందించిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణించడం ఎంతో దురదృష్టకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన నివాసంలో డీఎస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన డీఎస్ సేవలు మరువలేనియన్నారు.

    2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదిగిన నాయకులల్లో శ్రీనివాస్ ఒకరున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, దేశం కోసం యువత పని చేయాలని కోరుకున్న వ్యక్తుల్లో డీఎస్ ఒకరని తెలిపారు. అంతేగాక తెలంగాణ కోసం డీఎస్ ఎంతో పోరాటం చేశారన్నారు. అలాంటి మహనీయుడు శ్రీనివాస్ మరణించడం ఎంతో బాధాకరమన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. 

Similar News