రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ కోదండరాం

తెలంగాణా జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్

Update: 2024-10-25 07:16 GMT

దిశ, భద్రాచలం : తెలంగాణా జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోదండరాం కు కార్యనిర్వాహణాధికారి రమాదేవి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామి వారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. అంతకుముందు స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకింగ్ చేసిన కోదండరాం అక్కడ వాకర్స్ తో సమస్యలు గురించి చర్చించారు.


Similar News