గ్రీన్ ఫీల్డ్ హైవే టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు నిర్వహిస్తున్న లారీ టిప్పర్ ఢీకొని వ్యక్తి

Update: 2024-10-25 07:59 GMT

దిశ,సత్తుపల్లి/వేంసూరు : గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు నిర్వహిస్తున్న లారీ టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామానికి చెందిన తాడికొండ పాండు రంగా చారి (42) మర్లపాడు గ్రామంలో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం షాప్ నిమిత్తం అడసర్లపాడు గ్రామం నుండి మర్లపాడు వెళ్లేందుకు టూ వీలర్ పై వెళుతుండగా కల్లూరు గూడెం గ్రామంలో గ్రీన్ ఫీల్ హైవే పనులు నిర్వహిస్తున్న టిప్పర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడుకి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పై స్థానిక ఎస్సై వీరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News