రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది.

Update: 2024-10-25 10:11 GMT

దిశ, మెట్ పల్లి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారు వద్ద స్థానిక ఓ వైన్ షాప్ ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News