అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు

మంగళవారం అర్ధరాత్రి వెలసిన మావోయిస్టు ఫ్లెక్సీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపాయి.

Update: 2024-10-09 04:39 GMT

దిశ-బూర్గంపాడు: మంగళవారం అర్ధరాత్రి వెలసిన మావోయిస్టు ఫ్లెక్సీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందేళ్ల రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో ఈ మావోయిస్టు ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి’’ అంటూ ఆ ఫ్లెక్సీలపై రాసి ఉంది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు వారోత్సవాలు జరుపుతున్నట్లు ఫ్లెక్సీలలో వెల్లడించారు. వారం క్రితం ఇదే ప్రాంతంలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం సృష్టించాయి. అవి మరవక ముందే మళ్ళీ మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. బూర్గంపాడు మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Similar News