ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.
దిశ, ఖమ్మం : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాంతో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి స్పందించారు. కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ తో ఫోన్ లో మాట్లాడారు. ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.