కొద్ది రోజుల్లో వివాహం...అంతలోనే విషాదం

డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన దుమ్ముగూడెం మండలం లో చోటుచేసుకుంది.

Update: 2024-09-16 15:29 GMT

దిశ,దుమ్ముగూడెం: డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన దుమ్ముగూడెం మండలం లో చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి వరప్రద(21) భద్రాచలం సాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. గత వారం రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ లో 3 రోజులు వైద్యం పొంది, అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం రాత్రి మరణించింది.

21 ఏళ్ల వరప్రద మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు డెంగ్యూ కారణంగా మరణించడం తల్లిదండ్రులు రాజశేఖర్, ఏసుమనికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. గత కొన్ని రోజుల ముందే వరప్రధకు ఎంగేజ్మెంట్ జరుగగా, మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన తను డెంగ్యూ జ్వరం తో పోరాడుతూ మృత్యు ఒడిలోకి చేరింది. విషయం తెలుసుకున్న సాయి డిగ్రీ కళాశాల యాజమాన్యం, స్నేహితులు,గ్రామస్తులు వరప్రద మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండి మాట్లాడే తమ స్నేహితురాలు లేదని బాధతో బోరున విలపించారు.


Similar News