దిశ ఎఫెక్ట్ : ఏనుకూరు మండల విద్యాశాఖ అధికారిగా ఎస్కే రహీంబి

Update: 2025-03-21 09:40 GMT
దిశ ఎఫెక్ట్ : ఏనుకూరు మండల  విద్యాశాఖ అధికారిగా ఎస్కే రహీంబి
  • whatsapp icon

దిశ, ఏన్కూర్ : ఏన్కూరు మండల విద్యాశాఖ అధికారిగా ఎస్కే రహీంబి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ నుంచి ఉత్తర్వులు అందాయి. గురువారం డిజిటల్ పేపర్ లో ఏన్కూర్ మండలానికి విద్యాశాఖ అధికారులు లేనట్లేనా, అనే వార్తకు స్పందనగా విద్యాశాఖ అధికారి శుక్రవారం ఉత్తర్వులు పంపారు. ప్రస్తుతం ఎస్కే రహీం బి కెమెరా పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇన్చార్జి ఏం ఈవోగా, ఎస్ కే రహీం బి నియామకంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


Similar News