బైక్ ను ఢీకొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి

Update: 2024-08-28 09:04 GMT

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని జీడిగింజల గోదాముల సెంటర్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను డీసీఎం లారీ ఢీకొట్టడం ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మపేట వైపు నుండి పాల్వంచ వైపు వెళ్తున్న కూల్ డ్రింక్స్ లోడ్ తో వెళ్తున్న డీసీఎం వాహనం మల్లారం రోడ్డు నుంచి రోడ్డు క్రాస్ అవుతున్న బైక్ ను అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైక్ మీదున్న శేషగిరి నాగేశ్వరరావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం డీసీఎం వాహనం డివైడర్ను దాటుకుని రోడ్డుకు మరోపక్క బోల్తా పడింది. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడం, నిత్యం హమాలీలు కూర్చొని ఉండే ప్రాంతంలో ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. మృతి చెందిన వ్యక్తిని అశ్వారావుపేట మార్చరీకి తరలించారు. డీసీఎంలో ఉన్న కూల్ డ్రింక్స్ మొత్తం రోడ్డుపైన పడిపోవడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్లియర్ చేయించారు.


Similar News