మంత్రి పొంగులేటికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు

రామవరం లోని గురుకుల పాఠశాల విద్యార్థినులు

Update: 2024-10-28 15:14 GMT

దిశ, కొత్తగూడెం : రామవరం లోని గురుకుల పాఠశాల విద్యార్థినులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినూత్నంగా బర్త్డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే పొంగులేటి శీనన్న అనే ఆకారంలో వందలాది మంది విద్యార్థులు కూర్చోని ఆకర్షించేలా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడు బత్తిని రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.మంత్రి పొంగులేటి పై ఉన్న తన అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నట్లు బత్తిని రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతగా పొంగులేటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన చెప్పారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతోమంది పేద కుటుంబాలను పొంగులేటి ఆదుకున్నారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడలో మున్ముందుకు యువత సాగాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సహకరించిన గురుకుల విద్యార్థినులకు సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శనిగరపు అజయ్ కుమార్, మొగరం శివ, ఎస్కే పాషా, సందీప్ కుమార్ ముఖ్యులు పాల్గొన్నారు.


Similar News