Collector Jitesh V Patil : పర్యాటక ప్రాంతంగా తాలిపేరు ప్రాజెక్ట్

చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా

Update: 2024-10-28 12:59 GMT

దిశ, భద్రాచలం : చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాలిపేరు ప్రాజెక్టును సందర్శించారు . దీనిలో భాగంగా తాలిపేరు ప్రాజెక్టు నందుగల స్కాడా సిస్టమ్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు వద్ద, టూరిజం అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలించడమైనది.

దానితో పాటు, నీటిపారుదల శాఖ పరిధిలో గల ఖాళీ స్థలాలను గుర్తించి, నీటిపారుదల శాఖ అధికారులు. (MPDO)ఎంపీడీఓ సమన్వయంతో, ఖాళీ స్థలాల్లో వెదురు మొక్కల వనాలను ఏర్పాటు చేయవలసిందిగా సూచించడమైనది. ఈ కార్యక్రమంలో హెచ్.వి.రాంప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జె.తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నీటి పారుదల శాఖ, తహసీల్దార్ , ఎంపిడిఓ,తదితరులు పాల్గొన్నారు.


Similar News