Khammam Collector: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి

ప్రజావాణి లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి

Update: 2024-10-28 11:06 GMT

దిశ, ఖమ్మం : ప్రజావాణి లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని (Khammam Collector) జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్, డా. పి.శ్రీజ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం రాజేశ్వరి, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ. అరుణ, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News