రియల్ ఎస్టేట్ ముసుగులో మోసం చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు : సీపీ
రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి

దిశ, ఖమ్మం సిటీ : రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి లక్షల రూపాయల దోచుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం అర్బన్ మండలం అగ్రహారం ప్రాంతంలోని సర్వేనెంబర్ 42/ఇ,42/ఇఇ లో తమకు సంబంధం లేని పలు ప్లాట్ల పై తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి పలువురికి విక్రయించి మోసం చేసిన మానుకొండ శ్రీనివాస్ (ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట) తల్లాపల్లి రాజగిరి, (ఖమ్మం టౌన్) సిలివేరు రవి (శ్రీనివాస్ నగర్, ఖమ్మం) ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు కలిసి రూ. 5 లక్షల రూపాయల వరకు మోసం చేశారని, అదేవిధంగా మరో ఇద్దరు నుండి 25 లక్షల వరకు తీసుకొని మోసం చేశారని ఖమ్మం పార్శి బంధం ప్రాంతానికి చెందిన వినుకొండ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు విచారణ జరిపినట్లు తెలిపారు.
ముఖ్యంగా భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు సక్రమంగా వున్నది లేనిది క్షేత్రస్థాయి లోకి వెళ్లి పరిశీలించుకోవాలని సూచించారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు/ భూమి యాజమానలు ప్లాట్ల అభివృద్ధి పేరుతో ఫైనాన్సర్ల నుండి డబ్బు తీసుకొని ఫైనాన్సర్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అదే ప్లాట్లను మరొకరికి జీపీఏ చేసి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.