అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు 2024 -25 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డా. పోలారపు పద్మ తెలిపారు.

Update: 2024-06-28 15:02 GMT

దిశ,ఇల్లందు : ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు 2024 -25 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డా. పోలారపు పద్మ తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులలో 55 శాతం మార్కులతో పాసై ఉండాలని,

    ఎస్సీ, ఎస్టీ లకు 50 శాతం సరిపోతుందన్నారు. నీట్, సెట్, పీహెచ్ డీ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. జూలై 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు జూలై 3న కళాశాలలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. రాజనీతి శాస్త్రం 1, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 1 ఖాళీ ఉన్నాయని, మరింత సమాచారం కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.

Similar News