రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటనలో ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది.

Update: 2023-08-06 11:29 GMT

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటనలో ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి వైపు నుండి అశ్వారావుపేట వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అచ్చుతాపురం - నారంవారిగూడెం మధ్యనున్న భారీ మలుపులో ఎదురుగా వేగంగా మీదకు వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లింది.

అప్రమత్తమైన డ్రైవర్ బస్సుని అదుపు చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు పక్కకు వెళ్లిన చోట భారీ చెట్లు లేకపోవడం.. కొద్దిపాటి తేడాలో బోల్తాపడే లోపే బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు ద్వారం గుండా కిందకి దిగటానికి అవకాశం లేకపోవడంతో కిటికీల నుండి ప్రయాణికులు బయటికి రావాల్సి వచ్చింది.


Similar News