వేరే మహిళతో భర్త సహజీవనం.. ఇంటి ముందు బైఠాయించిన భార్య

Update: 2024-08-13 07:28 GMT

దిశ, శంకర్పట్నంః శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో మంగళవారం భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన శిరీష కు, శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బొంగొని ప్రవీణ్ కుమార్ తో 2017 మే 19న వివాహం జరిగింది. ఆగస్టు 17 2018న తనుశ్రీ అనే పాప జన్మించిందని పాప జన్మించినప్పటి నుండి తనను పట్టించుకోవడంలేదని శిరీష ఆవేదన వ్యక్తం చేస్తోంది. అదనపు కట్నం తేవాలని ఇబ్బందులకు గురి చేస్తూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య శిరీష కన్నీళ్లు పెట్టుకుంది. ఆ స్త్రీ మాయలో పడి.. తనను కాపురానికి తీసుకెళ్లట్లేదని ఆవేదన వెలుబుచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న కేశవపట్నం పోలీసులు శిరీషను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పారు. సదరు మహిళ నిరసన వ్యక్తం చేసే సందర్భంలో ఇంట్లో భర్త కానీ అత్తమామ కానీ లేకపోవడం శోచనీయం.


Similar News