జాతీయ రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

మెట్ పల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (బాలుర) ముందు 63 వ జాతీయ రహదారి పై విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Update: 2024-08-17 11:15 GMT

దిశ,మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల (బాలుర) ముందు 63 వ జాతీయ రహదారి పై విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాఖీ పండుగకి విద్యార్థులను ఇంటికి పంపించడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ... ఒక్క రోజు వర్షం పడితే మాత్రం 4 రోజులు సెలవులు ఇచ్చి

    ఇంటికి తీసుకెళ్లండి అంటూ ఫోన్లు చేసే ప్రిన్సిపాల్ సంవత్సరానికి ఒక్క సారి వచ్చే రాకీ పండుగకి మాత్రం పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జూబెర్ ను వివరణ కోరగా పై అధికారులు పంపించవద్దు అని అంటున్నారని, రాఖీ పండుగకు సెలవు లేదని అంటున్నారని చెప్పుకొచ్చారు. రోడ్డుపై విద్యార్థుల తల్లిదండ్రులు బైటయించడంతో రహదారి పై కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags:    

Similar News