నిరుపయోగంగా సింగరేణి భవనం.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..

గోదావరిఖని లోని విట్టల్ నగర్ పార్క్ పక్కన గల సింగరేణి భవనాన్ని

Update: 2024-09-30 09:16 GMT

దిశ,గోదావరిఖని: గోదావరిఖని లోని విట్టల్ నగర్ పార్క్ పక్కన గల సింగరేణి భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సింగరేణి అధికారుల కొరకు నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రి వేళలో మందుబాబులకు అడ్డగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆ దారి వెంట కాలేజీ విద్యార్థులు, మహిళలు పోవడానికి జంకుతున్నారు. అంతేకాకుండా సింగరేణి భవనంలో విచ్చలవిడిగా చెట్లు పెరగడంతో పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు భవనాన్ని ఉపయోగానికి తీసుకురావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.


Similar News