ప్రజా గొంతుకగా నిలుస్తా : ఎమ్మెల్సీ కోదండరాం

నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకమై కరీంనగర్ కు తొలిసారిగా

Update: 2024-09-30 13:56 GMT

దిశ,కరీంనగర్ : నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకమై కరీంనగర్ కు తొలిసారిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాం కు కరీంనగర్ లో ఉద్యమకారులు ఘనంగా పౌర సన్మానం చేశారు. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని, తాను ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులు పెండింగ్ లో ఉన్న తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంగం నరహరి జగ్గారెడ్డి, గోపాల్ రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కోజు వెంకటేశ్వర్లు,తదితరులు, పాల్గొన్నారు.


Similar News