హత్యకు గురైన వ్యక్తి ఇంటి ముందు ఆందోళన..

వేములవాడ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2024-09-30 11:31 GMT

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్తుల పంపకాల విషయంలో ఆదివారం హత్యకు గురైన మామిండ్ల మల్లయ్య ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మల్లయ్యను హత్య చేసిన దుండగులను అరెస్టు చేసే వరకు దహన సంస్కారాలు నిర్వహించేది లేదని మృతదేహంతో ఇంటి ముందు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో ఉద్రిక్తత నెలకొంది.


Similar News