గాంధీ జయంతి రోజు కూడా నాన్ వెజ్

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున కూడా జగిత్యాలలో నాన్ వెజ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి.

Update: 2024-10-02 12:49 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున కూడా జగిత్యాలలో నాన్ వెజ్ రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. జగిత్యాల బస్టాండ్ ముందు ఉన్న బిర్యానీ సెంటర్లను నిర్వాహకులు ఓపెన్ చేశారు. మరికొన్ని చోట్ల చికెన్ సెంటర్లను యథావిధిగా కొనసాగించారు. మున్సిపల్ అధికారులు ఒకరోజు ముందుగానే జంతు వథ చేయకూడదని, నాన్ వెజ్ రెస్టారెంట్లను నిర్వహించకూడదని నోటీసులు ఇచ్చినప్పటికీ పలు దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. దాంతో నిబంధనలు గాలికి వదిలేసిన సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Tags:    

Similar News