దిశ ఎఫెక్ట్... గుంతను పూడ్చిన పోలీసులు

సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో సైదాపూర్- మొలంపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతను పోలీసులు పూడ్చివేశారు.

Update: 2024-09-11 13:22 GMT

దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో సైదాపూర్- మొలంపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతను పోలీసులు పూడ్చివేశారు. దిశ పత్రికలో మంగళవారం ప్రచురితమైన పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు.. అనే కథనానికి స్థానిక ఎస్సై సీహెచ్. తిరుపతి స్పందించారు. ప్రమాదకరంగా మారిన గుంతను పోలీసు సిబ్బందితో బుధవారం కంకర సిమెంట్ వేసి పూడ్చివేశారు.  

Tags:    

Similar News