ఎన్.టీ.పీ.సీ ప్లాంట్ లో ప్రమాదం.. ఒకరి మృతి

రామగుండం ఎన్.టీ.పీ.సీ ప్లాంట్ లో బుధవారం సాయంత్రం ప్రమాదం ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2023-04-26 16:22 GMT

దిశ, గోదావరి ఖని: రామగుండం ఎన్.టీ.పీ.సీ ప్లాంట్ లో బుధవారం సాయంత్రం ప్రమాదం ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ప్లాంట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యగి జస్వంత్ హెచ్.పరమార్ (55) ప్రమాదవశాత్తు కింద జారి పడ్డాడు. దీంతో తోటి కార్మికులు ప్రథమ చికిత్స అందించి ధనవంతరి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. ఎన్.టీ.పీ.సీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం గురించి వివరాలు సేకరించారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీవన్ తెలపారు.

Tags:    

Similar News