గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు..

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పక్కా సమాచారం మేరకు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు.

Update: 2024-10-28 10:06 GMT

దిశ, వెల్గటూర్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పక్కా సమాచారం మేరకు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ధర్మపురి ఎస్సై మహేష్ తెలిపారు. ధర్మపురి మండలం మగ్గిడి గ్రామానికి చెందిన సల్లూరి నరేష్, మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామానికి చెందిన జున్నోజు రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ధర్మపురి పటేల్ గార్డెన్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్బంగా వారి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాదీనపరుచుకున్నట్లు తెలిపారు.

జన్నారం గ్రామానికి చెందిన జున్నోజు రాజేష్ @ శివ అనే వ్యక్తి గత కొన్ని నెలల నుండి గంజాయి తాగేందుకు బానిసయ్యాడు. తన వద్ద ఉన్న గంజాయిని తనకు కావలసినంత వినియోగించి మిగతాది ఇతరులకు అమ్మేవాడు. ఈ క్రమంలో మగ్గిడి గ్రామానికి చెందిన సల్లూరి నరేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి వారికి కావలసినంత వారు వినియోగించి మిగతాది తమ అవసరాలకు, జల్సాలకు గంజాయిని ఇతరులకు అమ్మేవారు. ఈ క్రమంలోనే మంగళవారం గంజాయి అమ్మే క్రమంలో ధర్మపురి పోలీసులు పక్కా సమాచారంతో కాపు కాసి ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.


Similar News