Rajanna Sircilla Collector : ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలి

ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్

Update: 2024-10-28 11:51 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజావాణి అర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ఆయా శాఖలకు సంబంధించిన మొత్తం 154 దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, పాల్గొన్నారు.


Similar News