Choppadandi MLA : ధాన్యం దళారుల పాలు చేయొద్దు

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారుల పాలు

Update: 2024-10-28 13:52 GMT

దిశ, కొడిమ్యాల : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారుల పాలు చేయొద్దు అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని ఆయన కోరారు, కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడకుండా నిర్వహకులు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలువెరీ నారాయణ గౌడ్,ప్యాక్స్ చైర్మన్ బండ రవీందర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, వైస్ కడారి మల్లేశం,గోల్కొండ రాజు, తదితరులు పాల్గొన్నారు.


Similar News