Kadiyam Srihari: ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాసింది బీఆర్ఎస్సే: కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్లపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫైర్ అయ్యారు.

Update: 2024-09-26 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్లపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. అయినా కాంగ్రెస్ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. ఇకవేళ ఉప ఎన్నికలే జరిగితే.. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని తేల్చి చెప్పారు. మొదటి నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది గులాబీ పార్టీ అని కామెంట్ చేశారు. అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ పార్టీ అని.. శాసనసభా పక్షాలను సైతం విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీదేనని కడియం శ్రీహరి అన్నారు.   


Similar News