ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో హైకోర్ట్ కీలక నిర్ణయం

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసు హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-10-24 10:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసు హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా హైకోర్ట్ సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ సెక్రెటరీ.. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. కాగా నేడు డివిజన్ బెంచ్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. నెల రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పుపై విచారణ మొదలు పెట్టగా..  ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ గడువు కోరారు. దీంతో వచ్చేనెల 4కు విచారణను వాయిదా వేసింది కోర్ట్.   


Similar News